
Sign up to save your podcasts
Or


“కామ క్రోధరహితులకు, చిత్తవృత్తుల జయించినవారికి, పరబ్రహ్మయైన పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటనూ శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.26). కోరికలు నుంచి, కోపము నుంచి ఎలా స్వేచ్ఛను పొందడం అనే ప్రశ్న ఉదయించడం సహజం .
ప్రతి తుఫాను యొక్క కేంద్రంలో ఒక ప్రశాంతమైన నేత్రం ఉంటుంది. అలాగే మన కోరికలు, కోపం అనే తుఫాన్ కి కూడా ఒక కోరికలు లేని, క్రోధము లేని కేంద్రం మనలోనే ఉంటుంది. ఆ కేంద్రాన్ని చేరుకోవడమే మోక్షం. ఈ ప్రక్రియలో కోరికలకు మూల కారణమైన 'నేను' అనే భావనను త్యజించడానికి ఎంతో ధైర్యం కావాలి.
రోజువారి జీవితంలో ఈ విషయాన్ని ఆచరణలో పెట్టడానికి రెండు సులభ పద్ధతులను పాటించవచ్చు. ఈ ప్రక్రియలో గతంలో మనం కోరికతో నిండిన అవస్థను గాని, కోపం తెప్పించిన ఒక పరిస్థితిని గాని మళ్ళీ గుర్తు తెచ్చుకుని సాక్షిగా గమనిస్తూ ఆ పరిస్థితుల్లో కృత్రిమంగా తిరిగి జీవించడమే. ‘అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒక్కటే అయినా ప్రతి ఒక్కరూ అదే సత్యాన్ని అనేక విధాలుగా గ్రహిస్తారు’ అన్న మెరుగైన అవగాహనతో దీన్ని పునరావృతం చేయాలి.
భారతీయ సంప్రదాయాలు జీవితాన్ని 'లీల' అంటే కేవలం ఒక నాటకం అంటాయి అంటే ఏ విషయాన్ని గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వారం పది రోజుల పాటు మనం ఒక నాటకంలో నటిస్తున్నట్టుగా భావించి దేన్నీ గంభీరంగా తీసుకోకుండా ఉత్సవ మనస్థితిలో ఉండడం అనేది రెండో మార్గము. ఇది ఒక నటుడు నాటకం కోసం కోరికను, కోపాన్ని అరువు తెచ్చుకుని వాటిని అనుభూతి చెందడం వంటిదే.
ఒకసారి వాటిపై పట్టు సాధించాక మనము సుఖదుఃఖాల వంటి ఇంద్రియాల జాలంలో చిక్కినా కూడా నెమ్మదిగా కోరికను, కోపాన్ని అప్పటికప్పుడే త్యజించడం నేర్చుకుంటాము. ఇది వర్తమానం లోనే పరమ స్వేచ్చను లేక మోక్షాన్ని పొందడం తప్ప మరేమీ కాదు.
చివరి అడుగు పరమాత్మను శరణు జొచ్చడము. పరమాత్మ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, “భగవంతుడు యజ్ఞములకు, తపస్సులకు భోక్త. సమస్త లోకములకు, లోకేశ్వరులకు అధిపతి. సమస్త ప్రాణులకును ఆత్మీయుడు. అనగా అవ్యాజ దయాళువు. పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్ తత్వమును ఎరిగిన భక్తునకు పరమ శాంతి లభించును.” అని చెబుతారు (5.29).
దీనితో 'కర్మ సన్యాస యోగం' లేక 'కర్మ ఫలాలను త్యజించడం ద్వారా ఐక్యత చెందడం' అని పిలవబడే భగవద్గీతలోని ఐదవ అధ్యాయము సమాప్తం అవుతుంది.
By Siva Prasad“కామ క్రోధరహితులకు, చిత్తవృత్తుల జయించినవారికి, పరబ్రహ్మయైన పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటనూ శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.26). కోరికలు నుంచి, కోపము నుంచి ఎలా స్వేచ్ఛను పొందడం అనే ప్రశ్న ఉదయించడం సహజం .
ప్రతి తుఫాను యొక్క కేంద్రంలో ఒక ప్రశాంతమైన నేత్రం ఉంటుంది. అలాగే మన కోరికలు, కోపం అనే తుఫాన్ కి కూడా ఒక కోరికలు లేని, క్రోధము లేని కేంద్రం మనలోనే ఉంటుంది. ఆ కేంద్రాన్ని చేరుకోవడమే మోక్షం. ఈ ప్రక్రియలో కోరికలకు మూల కారణమైన 'నేను' అనే భావనను త్యజించడానికి ఎంతో ధైర్యం కావాలి.
రోజువారి జీవితంలో ఈ విషయాన్ని ఆచరణలో పెట్టడానికి రెండు సులభ పద్ధతులను పాటించవచ్చు. ఈ ప్రక్రియలో గతంలో మనం కోరికతో నిండిన అవస్థను గాని, కోపం తెప్పించిన ఒక పరిస్థితిని గాని మళ్ళీ గుర్తు తెచ్చుకుని సాక్షిగా గమనిస్తూ ఆ పరిస్థితుల్లో కృత్రిమంగా తిరిగి జీవించడమే. ‘అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒక్కటే అయినా ప్రతి ఒక్కరూ అదే సత్యాన్ని అనేక విధాలుగా గ్రహిస్తారు’ అన్న మెరుగైన అవగాహనతో దీన్ని పునరావృతం చేయాలి.
భారతీయ సంప్రదాయాలు జీవితాన్ని 'లీల' అంటే కేవలం ఒక నాటకం అంటాయి అంటే ఏ విషయాన్ని గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వారం పది రోజుల పాటు మనం ఒక నాటకంలో నటిస్తున్నట్టుగా భావించి దేన్నీ గంభీరంగా తీసుకోకుండా ఉత్సవ మనస్థితిలో ఉండడం అనేది రెండో మార్గము. ఇది ఒక నటుడు నాటకం కోసం కోరికను, కోపాన్ని అరువు తెచ్చుకుని వాటిని అనుభూతి చెందడం వంటిదే.
ఒకసారి వాటిపై పట్టు సాధించాక మనము సుఖదుఃఖాల వంటి ఇంద్రియాల జాలంలో చిక్కినా కూడా నెమ్మదిగా కోరికను, కోపాన్ని అప్పటికప్పుడే త్యజించడం నేర్చుకుంటాము. ఇది వర్తమానం లోనే పరమ స్వేచ్చను లేక మోక్షాన్ని పొందడం తప్ప మరేమీ కాదు.
చివరి అడుగు పరమాత్మను శరణు జొచ్చడము. పరమాత్మ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, “భగవంతుడు యజ్ఞములకు, తపస్సులకు భోక్త. సమస్త లోకములకు, లోకేశ్వరులకు అధిపతి. సమస్త ప్రాణులకును ఆత్మీయుడు. అనగా అవ్యాజ దయాళువు. పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్ తత్వమును ఎరిగిన భక్తునకు పరమ శాంతి లభించును.” అని చెబుతారు (5.29).
దీనితో 'కర్మ సన్యాస యోగం' లేక 'కర్మ ఫలాలను త్యజించడం ద్వారా ఐక్యత చెందడం' అని పిలవబడే భగవద్గీతలోని ఐదవ అధ్యాయము సమాప్తం అవుతుంది.

912 Listeners