
Sign up to save your podcasts
Or


#చివరకుమిగిలేది
కావ్య ఖండాల్లాంటి కథలెన్నో వ్రాసిన ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు వ్రాసిన ఒకే ఒక నవల – చివరకు మిగిలేది. అయితేనేం, తెలుగులో వచ్చిన ముఖ్యమైన మూడు మనోవైజ్ఞానిక నవల్లో ఒకటిగా పేరు గడించింది. మిగతావి గోపీచంద్ 'అసమర్ధుని జీవయాత్ర', రావిశాస్త్రి 'అల్పజీవి'.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు పఠన్య గ్రంధంగా నిర్దేశింపబడిన ఈ నవల గురించి బుచ్చిబాబు గారే స్వయంగా ఇలా వ్రాసారు.
"గతించిపోయిన యౌవనం, జాడ్యం, బీదతనం, మృత్యువు- ఇవి జీవితంలోని చెడుగు. ఈ చెడుగులో మానవుడు గుండె బాదుకోవల్సిన విషాదం ఏమీ లేదు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు; నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం, ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా ఉండొచ్చు; కాని ప్రేమించలేకపోవడంతో అట్లా సమాధానపడేటందుకేమీ లేదు. కృష్ణశాస్త్రి 'నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు'-కంటె విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది. దీన్నిబట్టి ఈ సమస్యని నవలలో చర్చించి, ఒక సమాధానం కనుక్కున్నానని కాదు. ఈ వస్తువుని వ్రాసేస్తే విషయం నాకు విశదపడుతుందనీ, నలుగురితో పంచుకుంటే బాధ నుండి విముక్తి లభిస్తుందనీ తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకి ప్రేరణ. ప్రేమించలేపోవడం ఒకటే కాదు ఈ నవలలో వస్తువు. జీవితంలో 'చెడుగు' - 'పాపం' - ముఖ్యంగా పెద్దలు చేసిన తప్పిదాలు పిన్నలపైబడి వారి జీవితాల్ని ఏవిధంగా వికసించనీయకుండా, పాడుచేసింది- యిది కూడా ఒక ప్రధానమైన అంశమే. ఒకరు చేసిన అపచారాలకి మరియొకరు బాధ్యులై బాధపడడం వల్ల సమాజంలో వ్యక్తిగతమైన నైతిక విలువలకి తావులేకుండా పోతుంది"
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
By Dasubhashitam#చివరకుమిగిలేది
కావ్య ఖండాల్లాంటి కథలెన్నో వ్రాసిన ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు వ్రాసిన ఒకే ఒక నవల – చివరకు మిగిలేది. అయితేనేం, తెలుగులో వచ్చిన ముఖ్యమైన మూడు మనోవైజ్ఞానిక నవల్లో ఒకటిగా పేరు గడించింది. మిగతావి గోపీచంద్ 'అసమర్ధుని జీవయాత్ర', రావిశాస్త్రి 'అల్పజీవి'.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు పఠన్య గ్రంధంగా నిర్దేశింపబడిన ఈ నవల గురించి బుచ్చిబాబు గారే స్వయంగా ఇలా వ్రాసారు.
"గతించిపోయిన యౌవనం, జాడ్యం, బీదతనం, మృత్యువు- ఇవి జీవితంలోని చెడుగు. ఈ చెడుగులో మానవుడు గుండె బాదుకోవల్సిన విషాదం ఏమీ లేదు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు; నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం, ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా ఉండొచ్చు; కాని ప్రేమించలేకపోవడంతో అట్లా సమాధానపడేటందుకేమీ లేదు. కృష్ణశాస్త్రి 'నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు'-కంటె విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది. దీన్నిబట్టి ఈ సమస్యని నవలలో చర్చించి, ఒక సమాధానం కనుక్కున్నానని కాదు. ఈ వస్తువుని వ్రాసేస్తే విషయం నాకు విశదపడుతుందనీ, నలుగురితో పంచుకుంటే బాధ నుండి విముక్తి లభిస్తుందనీ తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకి ప్రేరణ. ప్రేమించలేపోవడం ఒకటే కాదు ఈ నవలలో వస్తువు. జీవితంలో 'చెడుగు' - 'పాపం' - ముఖ్యంగా పెద్దలు చేసిన తప్పిదాలు పిన్నలపైబడి వారి జీవితాల్ని ఏవిధంగా వికసించనీయకుండా, పాడుచేసింది- యిది కూడా ఒక ప్రధానమైన అంశమే. ఒకరు చేసిన అపచారాలకి మరియొకరు బాధ్యులై బాధపడడం వల్ల సమాజంలో వ్యక్తిగతమైన నైతిక విలువలకి తావులేకుండా పోతుంది"
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.