Harshaneeyam

కథా చక్రభ్రమణం


Listen Later

మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు పలు రకాల కథలు చెప్పేది, కొన్ని కథలు సందర్భాను సారంగా, మరి కొన్ని నాకిష్టమైనవవడంతో నేను పదే పదే అడిగేవి.

అమ్మమ్మ, నేను ఏ మేకనో, గొర్రెనో తిన్న రోజున నా పొట్ట మీద చెయ్యేసి మూడు మార్లు నిమురుతూ చెప్పేది, “వాతాపీ జీర్ణం” అని, అటు పిమ్మట ఆ కథ లోకి వెళ్ళేది.

వాతాపి మరియు వాడి సోదరుడు రాకాసులు. వాళ్ళ పని మునులు చేసుకొనే యజ్ఞాలకు ఆటంకాలు కలిగించటమే. ఈ ఆటంకాలు కల్పించటం లో ఒక్కో రాక్షసులకు ఒక్కో పద్ధతి వుంటుందట. వీళ్ళ పద్ధతి ఏమిటంటే ముందుగా వాతాపి వాడికొచ్చిన కామరూప విద్యతో ఓ మేకగా మారి మునుల ఆశ్రమ ప్రాంతాలలో తిరుగాడటం, ఆ మేకను చూసిన పిచ్చి మునులు ఆహా యజ్ఞానికి సమర్పించడానికి ఓ బలి మేక దొరికిందని సంబర పడటం, దాన్ని పట్టకెళ్లి యజ్ఞ సమర్పణ పేరుతో సుష్టుగా గా భోంచెయ్యటం, అలా భోంచేసిన మునుల భుక్తాయాసం తీరక ముందే, వాతాపి సోదరుడు వచ్చి, ఒరే వాతాపీ! వాతాపీ! నువ్వులేకుండా నేను వుండలేనురా రారా నాయనా అని పిలవటం, వాడు ఆ మునుల పొట్టను చీల్చుకుంటూ వచ్చేయ్యటం.

ఇలా వాళ్ళు మన బుడుగు మాటల్లో చెప్పాలంటే ఓ వందో లేక వెయ్యో లేక ఓ ఇరవయ్యో మునులను చంపేశారట. ఈ తతంగం అంత మన అగస్త్య మహా మునికి చాలా కోపం తెప్పించింది.

ఈ వాతాపీ గాడు వాడి సోదరుడు భరత ఖండములో అసలు యజ్ఞాలే చేయకుండా కోట్లాది మేకల్ని భోంచేసే దుష్ట మానవులందరినీ వదిలేసి, మా ముని జాతి మీదే ఎందుకు పడ్డారు అని, వీళ్ళ పని పట్టాలని అప్పటికి అప్పుడే అనుకొనేశారట.

రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదవేముంది, అగస్త్య మహా ముని తల్చుకుంటే యజ్ఞాలకు కొదవా. వెంటనే ఓ యజ్ఞం మొదలెట్టేసేయ్యటమేమిటి, వాతాపీ గాడు యీ మారు గొఱ్ఱెయ్యి పోవటమేమిటి, వాడిని పథకం ప్రకారం ఆయన మాత్రమే భోంచేసేయ్యటం వెంట వెంటనే జరిగిపోయాయి. భోజనాలు అయ్యాక ఆయన తన పొట్టమీద చేయి వేసుకొని, హాయిగా నిమురుకుంటూ, “వాతాపీ జీర్ణం” అని మూడు సార్లు అనుకోగానే వాతాపీ సున్నం లో ఎముక కూడా మిగలకుండా జీర్ణం అయిపోయాడట.

వాళ్ళ అన్న వచ్చి వాతాపీ రారా బయటకి, రారా బయటకి అని ఎన్ని సార్లు పిలిచినా జీర్ణమయిపోయిన వాతాపీ ఇక బయటకి రాలేదు. మా వాతాపీ అసలిక్కడకు రాలేదేమో అనుకోని వాడు దేశం లో మునులు కాదు, చాలా మంది మేకల్ని గొర్రెల్ని భోంచేసి వాళ్ళున్నారు, ఎక్కడో వాళ్ళ కడుపులో జీర్ణం కాని మా వాతాపీ గాడు ఉంటాడు అని దేశం మీద పడి ఇప్పటికీ అరుచుకుంటూ తిరుగుతున్నాడట.

అందుకే మేకనో గొఱ్ఱెనో తిన్న రోజున అమ్మమ్మలు తమ మనవళ్ల పొట్టలు వాతాపి జీర్ణం అని మూడు సార్లు నిమరాలట.

ఈ కథ వింటుంటే నాలో బుడుగు మళ్ళి బయటకి వచ్చేవాడు, అదేవిటి నిన్నో మొన్నో లేక ఈ రోజో నేను ఉలవపాళ్ళకి వెళ్ళినప్పుడు గుడి అయ్యోరి కొడుకు స్వామి తో నేను ఓ కోడిని కోడిని లేపేసా అనగానే, భళ్ళున వాంతి చేసుకొని, అప్రాచ్యుడా! నువ్వు నా స్నేహానికి తగవుపో అన్నాడు, మరి ఇక్కడ మునులు మేకల్ని మేకల్నే మింగేశారు అని చెప్తున్నావు అని మా అమ్మమ్మతో వాదనకి దిగేవాడిని.

మా అమ్మమ్మ చాలా తెలివిగా తప్పించుకునేది, ఏమోరా అబ్బీ నాకేమి తెలుసు, ఈ కథ నేను సి గాన పెసూనాంబ అంత వున్నప్పుడు నాకు మా అమ్మమ్మ చెప్పింది, నేను నీకు చెబుతున్నా, అంతకు మించి నన్ను ఈ కథ తో ఇరికించకు నాయన, అసలే నీకు నోటి దూల ఎక్కువ అని వార్నింగ్ ఇచ్చింది.

అసలు మీ అమ్మమ్మకు ఎవరు చెప్పారు అని పరిశోధన చేయబోయిన నాకు ఆవిడ సమాధానం చాలా చలాకీగా వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ అని. ఓహో ఇక ఇది తెగేది కాదులే అని వదిలేసా నా అధ్యయనాన్ని. అలా వదిలేసిన అధ్యయనం ఇప్పటికీ మొదలెట్టలా ఎందుకంటే అమ్మమ్మ కథలలో తప్పొప్పులు ఎంచడానికి అమ్మమ్మ అధ్యయనం కాదు ఓ జ్ఞాపకం.

అలా ఆవిడ చెప్పే కథల్లో నాకు నచ్చిన ఇంకో కథ, నేను పదే పదే చెప్పమని అడిగే కథ, ఒక తోడేలు ఒక గొర్రె పిల్లని తినెయ్యాలని అనుకొని, తాను వాగుకి పైన నీళ్లు తాగుతూ కూడా దిగువున తాగే గొర్రె పిల్లతో వాదానికి ది

...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshavardhan