రావణుడు సీతను అపహరించి లంకకు చేర్చాడు. రాముడు మారీచుడు అరిచిన తీరు చూసి ఎదో కీడు గ్రహించి వెనుదిరిగి ఆశ్రమానికి వస్తుండగా లక్ష్మణుడు ఎదురొచ్చాడు. ఇద్దరూ కంగారుగా ఆశ్రమానికి వెళ్లేసరికి సీత కనపడలేదు. అడవంతా గాలిస్తుండగా జటాయువు గాయాలతో కొనఊపిరితో కనిసిపించాడు.