01.27.2019 - By Kadachepta Team
సుగ్రీవుడు వనరులందరికి పదిహేను రోజుల్లో కిష్కిందకి రావాలని ఆదేశాన్ని ఇచ్చాడు. లక్షల కోట్ల సంఖ్యలో రకరకాల వానరులు కిష్కింధకు చేరాయి. సుగ్రీవుడు నలుదిక్కుల వారిని పంపి సీతాకోసం వెతకమన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులు వెళ్లిన వానరులంతా సీత దొరకలేదని తిరిగివచ్చారు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులు దక్షిణం వైపు వెళ్లారు. 6 నెలలు గడిచినా కానీ వారికీ సీత జాడ తెలియలేదు.