02.10.2019 - By Kadachepta Team
భీకర యుద్ధం ఆరంభమయింది. ఇంద్రజిత్తును యుద్ధరంగంలో అంగదుడితో తలపడి తరువాత మాయాయుద్ధం మొదలుపెట్టాడు. రామ లక్ష్మణుల మీదకు నాగాస్త్రం విడిచి వారిని కట్టి పడేసి సందులేకుండా బాణాలతో కొట్టాడు.. రామలక్ష్మణులు చనిపోయారని భావించి తిరిగి వెళ్ళాడు. వానర సేన శోకసముద్రంలో మునిగిపోయింది.