
Sign up to save your podcasts
Or


#సాక్షి
పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 1865 నవంబరు 2, 1940 జనవరి 1 మధ్య, అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధం నుంచి 20వ శతాబ్దం పూర్వార్ధం వరకూ జీవించిన సుప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి అనే పేరుతో ఉపన్యాసాల ద్వారా ఆంద్ర వచన రచనలో ఒక కొత్త ప్రక్రియనూ, కొత్త ఒరవడిని సృష్టించిన మేధావి. కాల్పనిక సన్నివేశాలతో, ఊహాజనిత పాత్ర ద్వారా వివిధ సామాజిక అంశాల మీద ఉపన్యాస ధోరణిలో చేసిన వ్యాఖ్యానాలు ఈ సాక్షి వ్యాసాలు. ఏ కాలంలో గానీ ఎవరూ కనీస మాత్రంగా స్పృశించడానికి కూడా సాహసం చేయని అత్యంత సున్నితమైన అంశాలపై సైతం అలవోకగా వ్యాఖ్యానించడమే కాకుండా మొహమాటం లేకుండా, పదునైన పదాలతో సూటిగా ముక్కుమీద గుద్దినట్టు, నెత్తిన మొట్టినట్టు తార్కికంగా, వివాద రహితంగా, వినేవారికి విసుగు కలుగకుండా చెప్పడం ఈ వ్యాసాలలో ప్రత్యేకత. ధారాపాతంగా సాగిపోతున్న ఒక ప్రసంగాన్ని మధ్యలో ఎలా విడిచి వెళ్ళలేమో, ఈ వ్యాసాలను ఒకసారి చదవటం అంటూ మొదలు పెడితే, పూర్తి కాకుండా విరమించడం అసాధ్యం. చదవటం పూర్తయిన తరువాత కూడా ఏ పని చేస్తున్నా అప్పటివరకూ చదివిన విషయమే మనసును తొలిచేస్తూ ఇది ఫలానా అని చెప్పవీలులేని ఒక ఆవేశం నిలువెల్లా ఆవహిస్తుంది. పాఠకులకు ఇలాంటి చిత్త స్థితి కల్పించిన రచనలు చాలా కొద్ది. ఇదీ పానుగంటివారి సాక్షి వ్యాసాల వైశిష్ట్యం.
–
#సాక్షి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-sakshi
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#సాక్షి
పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 1865 నవంబరు 2, 1940 జనవరి 1 మధ్య, అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధం నుంచి 20వ శతాబ్దం పూర్వార్ధం వరకూ జీవించిన సుప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి అనే పేరుతో ఉపన్యాసాల ద్వారా ఆంద్ర వచన రచనలో ఒక కొత్త ప్రక్రియనూ, కొత్త ఒరవడిని సృష్టించిన మేధావి. కాల్పనిక సన్నివేశాలతో, ఊహాజనిత పాత్ర ద్వారా వివిధ సామాజిక అంశాల మీద ఉపన్యాస ధోరణిలో చేసిన వ్యాఖ్యానాలు ఈ సాక్షి వ్యాసాలు. ఏ కాలంలో గానీ ఎవరూ కనీస మాత్రంగా స్పృశించడానికి కూడా సాహసం చేయని అత్యంత సున్నితమైన అంశాలపై సైతం అలవోకగా వ్యాఖ్యానించడమే కాకుండా మొహమాటం లేకుండా, పదునైన పదాలతో సూటిగా ముక్కుమీద గుద్దినట్టు, నెత్తిన మొట్టినట్టు తార్కికంగా, వివాద రహితంగా, వినేవారికి విసుగు కలుగకుండా చెప్పడం ఈ వ్యాసాలలో ప్రత్యేకత. ధారాపాతంగా సాగిపోతున్న ఒక ప్రసంగాన్ని మధ్యలో ఎలా విడిచి వెళ్ళలేమో, ఈ వ్యాసాలను ఒకసారి చదవటం అంటూ మొదలు పెడితే, పూర్తి కాకుండా విరమించడం అసాధ్యం. చదవటం పూర్తయిన తరువాత కూడా ఏ పని చేస్తున్నా అప్పటివరకూ చదివిన విషయమే మనసును తొలిచేస్తూ ఇది ఫలానా అని చెప్పవీలులేని ఒక ఆవేశం నిలువెల్లా ఆవహిస్తుంది. పాఠకులకు ఇలాంటి చిత్త స్థితి కల్పించిన రచనలు చాలా కొద్ది. ఇదీ పానుగంటివారి సాక్షి వ్యాసాల వైశిష్ట్యం.
–
#సాక్షి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-sakshi
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.