
Sign up to save your podcasts
Or


#యజ్ఞం తో పదేను
తెలుగు సాహిత్యంలో ఎన్నో అమూల్య రచనలు సాహితీ సామ్రాజ్య సింహాసనాలను అలంకరించి ఎందరో పండితోత్తముల నీరాజనాలు అందుకున్నాయి. అటువంటి వాటి సరసన చేర్చదగిన వాటిలో ఒకటి శ్రీ కాళీపట్నం రామారావు గారి 'యజ్ఞంతో పదేను’ కథా సంపుటి. 1966లో, ఆ రోజుల్లో ప్రముఖ మాసపత్రిక ‘యువ’ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన 'యజ్ఞం' అనే అక్షర అంకురం, అనంతరకాలంలో సాహితీ మహావృక్షమై 'నూరేళ్ళ కథ' పండుగల్లో గొల్లపూడి మారుతీరావు వంటి ప్రముఖుల వందనాలందుకున్నది. అంతే కాదు, పెను సంచలనాన్ని సృష్టించి సాహితీ వర్గాల్లో రసవత్తరమైన చర్చకు ఆస్కారమిచ్చింది. మరీ విచిత్రంగా ఆ చర్చ ప్రధానాంశంగా 'కథా యజ్ఞం' అనే మరో రచనకు దారితీసింది. నిశ్చయంగా ఇది 'సాహిత్య విమర్శ'కు సంబంధించి ఒక కొత్త పుంత. "యజ్ఞం తో తొమ్మిది" అనే కథ సంపుటానికి 1995 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారు. ఆ తొమ్మిది కథలకు మరో ఆరు జేర్చి 'యజ్ఞంతో పదేను' కథా సంపుటాన్ని శ్రవణానువాదానికి అనుమతిస్తూ ఆ పుస్తక ప్రతిని చేవ్రాలు సహితంగా స్వహస్తాలతో వారే అందజేసి 'దాసుభాషితం' ను ఆశీర్వదించారు. వారు అందించిన ఆశీస్సులు 'దాసుభాషితం' శ్రోతలకు అందజేస్తూ సమర్పిస్తున్నాను. వినండి. 'యజ్ఞం'తో పదేను’ కథా సంపుటి శ్రవణ పుస్తకం. శ్రవణానువాదం గళం కొండూరు తులసీదాస్.
–
#యజ్ఞం తో పదేను శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-yajnam-tho-padenu
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#యజ్ఞం తో పదేను
తెలుగు సాహిత్యంలో ఎన్నో అమూల్య రచనలు సాహితీ సామ్రాజ్య సింహాసనాలను అలంకరించి ఎందరో పండితోత్తముల నీరాజనాలు అందుకున్నాయి. అటువంటి వాటి సరసన చేర్చదగిన వాటిలో ఒకటి శ్రీ కాళీపట్నం రామారావు గారి 'యజ్ఞంతో పదేను’ కథా సంపుటి. 1966లో, ఆ రోజుల్లో ప్రముఖ మాసపత్రిక ‘యువ’ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన 'యజ్ఞం' అనే అక్షర అంకురం, అనంతరకాలంలో సాహితీ మహావృక్షమై 'నూరేళ్ళ కథ' పండుగల్లో గొల్లపూడి మారుతీరావు వంటి ప్రముఖుల వందనాలందుకున్నది. అంతే కాదు, పెను సంచలనాన్ని సృష్టించి సాహితీ వర్గాల్లో రసవత్తరమైన చర్చకు ఆస్కారమిచ్చింది. మరీ విచిత్రంగా ఆ చర్చ ప్రధానాంశంగా 'కథా యజ్ఞం' అనే మరో రచనకు దారితీసింది. నిశ్చయంగా ఇది 'సాహిత్య విమర్శ'కు సంబంధించి ఒక కొత్త పుంత. "యజ్ఞం తో తొమ్మిది" అనే కథ సంపుటానికి 1995 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారు. ఆ తొమ్మిది కథలకు మరో ఆరు జేర్చి 'యజ్ఞంతో పదేను' కథా సంపుటాన్ని శ్రవణానువాదానికి అనుమతిస్తూ ఆ పుస్తక ప్రతిని చేవ్రాలు సహితంగా స్వహస్తాలతో వారే అందజేసి 'దాసుభాషితం' ను ఆశీర్వదించారు. వారు అందించిన ఆశీస్సులు 'దాసుభాషితం' శ్రోతలకు అందజేస్తూ సమర్పిస్తున్నాను. వినండి. 'యజ్ఞం'తో పదేను’ కథా సంపుటి శ్రవణ పుస్తకం. శ్రవణానువాదం గళం కొండూరు తులసీదాస్.
–
#యజ్ఞం తో పదేను శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-yajnam-tho-padenu
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.