పవిత్ర షిర్డీ క్షేత్రము, అహ్మద్ నగర్ జిల్లాలోని,  కోపర్గామ్ తాలూకాకు చెందినది.   శ్రీ సాయినాధుడు "షిరిడీలో వర్ధిల్లి" పవిత్రమొనర్చారు.   అయోని సంభవుడైన శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను, బాబా అనుమతితో, ఆశీర్వాదంతో శ్రీ హేమాడ్ పంత్ మరాఠీ భాషలో "శ్రీ సాయి సచ్చరిత్ర" అను గ్రంధాన్ని మనకందించారు.    దీనిని,  శ్రీ  పర్తి నారాయణరావు గారు ఆంధ్రీకరించి, మన తెలుగు ప్రజలకు గొప్ప ఉపకారము చేసినారు.   ఈ అనువాదమును కూడా  చదివే వెసులుబాటు, సమయం లేని  సాయి బంధువుల కోసం, ప్రతీ అధ్యాయం చదివి అందించే చిన్న ప్రయత్నం చేస్తున్నాము. శ్రీ పర్తి నారాయణ రావు గారికి,  ఈ భగవత్ కార్యంలో సంహరించి, నన్ను ప్రోత్సహిస్తున్న  ప్రతీ ఒక్కరికీ   "కృతజ్ఞతలు"