Harshaneeyam

తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి'


Listen Later

తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.

తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.

ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి చూసిన మనిషి' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.

తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి, హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

ఈ పుస్తకం మీరు కోనేటందుకు కావలసిన వివరాలు , ఇదే వెబ్ పేజీ లో ఇవ్వటం జరిగింది.

కథ:

గవరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరు ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకుముందు రోజునే చైనా ఇండియా సరిహద్దులలో దురాక్రమణ చేసిందనీ, యుద్ధం జరుగుతూన్నదనీ వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మరచిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ వూరువారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది. యింత తెలుగు దేశంలోనూ!

రోడ్ల కూడలిలో, కాఫీ హోటలులో (ఆవూళ్ళో ఒకటే వుంది) పొలంగట్లనీ, పంచాయితీ బిల్డింగ్ దగ్గరా పురుషులూ; పెరటి గోడల దగ్గరా, బావులూ, నీలాటి రేవుల దగ్గరా ఆడవాళ్ళూ ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే యింత సంచలనం కలిగించకపోను; అందులోనూ ఎందుకూ పనికిరాని ఎదురింటి అరుగుమీది మిషన్ కుట్టుపనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా వుంది. ఇంతకన్న మరో ఏ పెద్దమనిషితో లేచిపోయినా యింత అప్రదిష్ట ఉండకపోనని వూళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువకులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టూ అన్యాయం చేసినట్టూ బాధపడ్డారు.

“వాడిలో ఏం చూసి లేచిపోయిందత్తా” అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక.

“పోనీ నువ్వే వాడితో లేచి పోకపోయావూ నీకు తెలిసొచ్చును” అంది అత్తగారు విసుగుతో, కోపంతో.

“గవరయ్యకి బాగా శాస్త్రి అయింది” అని ఏకగ్రీవంగా ఆబాల గోపాలమూ తీర్మానించారు. 

గవరయ్యను చూసి జాలిపడినవాడూ సానుభూతి తెలిపినవాడూ ఒక్కడు లేడు.

గవరయ్య అంటే ఆ వూళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడుదిగుడుగా వుంటాడు. మొహంమీద స్ఫోటకం మచ్చలు, పెదాలు లావుగా

మోటుగా వుంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళీ పురుగులు అతికించినట్లు వుంటాయి. ఊరికి శివారున వున్న పెద్ద పెంకుటింటి లోగిలిలో గవరయ్య వుంటాడు.

“నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని” అన్నాడు కన్నులరమూసి అవధాని. అవధాని ఆ వూళ్ళో ధర్మకర్త.

మునసబు చలపతి, కరణం నరసింహమూ తల వూపారు. దాంతో మరికాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యంలాంటి పై వాక్యానికీ వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త.

“వేణుగోపాలస్వామి వూరికే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇంక ఈ రెండో ఆవిడ చావుకన్న ఘోరమైన పని చేసి వూరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా? ఒక్క మంచిమాట చెవిని పెట్టాడా?”

మున్సబు చలపతి చేతికర్రను నేలమీద తాటించి అన్నాడు “ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడా? కర్కోటకుడండీ యీ గురవయ్య. ఎంత అహం, ఎంత పొగరు....”

“పాపపు సొమ్మండీ పాపిష్టి ఆర్జితం! దాని ఫలితం వూరికే పోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చందాకి ఒక్క రూపాయి _ ఒబ్బు రూపాయి యిమ్మంటే తరిమి కొట్టాడుట...” అన్నాడు కరణం.

గవరయ్య యిరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళవాడు ఈ వూరొచ్చాడు. ఈ వూళ్ళో అతనికో మేనత్త వుంది. తల్లీ తండ్రి లేని అతను యీ మేనత్త దగ్గరకు వచ్చిపడ్డాడు. వస్తూనే కొంత డబ్బుకూడా తీసుకుని వచ్చాడు. ఈ వూరికి రెండు మైళ్ళ దూరంలోనే టౌను వుంది. రోజూ ఉదయమే టౌన్ కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగొచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ “హరీ హరీ” అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో యిది చాలా పాపమనీ బెడిసికొడుతూందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ మాట్లాడలేదు. కొందరు చొరవచేసి గవరయ్యతో జంతు చర్మ విక్రయం మంచిది కాదని చెప్పారు.

“జంతువులేం ఖర్మ మనుషుల తోలునే అమ్ముతాను. మరీ పల్చన కాబట్టి పనికి రాదు కాని” అని సమాధానమిచ్చాడట గవరయ్య.

గవరయ్య ఒంటెత్తుమనిషి. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. అసలు గవరయ్య నవ్వడం ఎవరూ చూడలేదు. అదేకాక గవరయ్యకి “పాపం” 'పుణ్యం” అని భేదాలు వున్నట్టు కూడా తెలియదు.

ఈ యిరవై ఏళ్ళలోనూ అతను లక్ష రూపాయలకి పైగా సంపాదించాడని ప్రతీతి. ఊళ్ళో పెద్దలు - ఉదారులూ ధర్మపరులూ కాబట్టి, అతని పాప వ్యాపారాన్ని క్షమించి అతని శ్రేయస్సు కోరి అతని ఆముష్మిక సుఖం కోసం దానధర్మాలు చేయమనీ, గుడి మండపం కట్టించమనీ, పాఠశాల బిల్డింగ్ కి చందా యిమ్మనమనీ, సప్తాహాలు చేయించమనీ చెవిలో యిల్లు కట్టుకుని చెప్పారు.

గవరయ్య గుండ్రంగా లోతుగా వున్న కళ్ళని కుంచించి మోటైన పెదాలమధ్య చుట్టని నొక్కి పెట్టి, విసుగ్గా, విసురుగా “నేనొక్క కానీ యివ్వను, పోయి మీ అబ్బతో చెప్పుకోండి” అనేవాడు. మంచి లేదు, మర్యాదా లేదు వీడికి అనుకున్నారు వాళ్ళందరూ పరోక్షంగా. అతనికి లక్ష రూపాయలుండడంవల్ల అతని ఎదురుగా అలా అనలేదు. వాళ్ళు సహజంగా జ్ఞానులు కాబట్టి.

గవరయ్య మేనత్తగారింటికి చేరిన కొద్ది రోజులలోనే మొదటి భార్యను తీసుకొచ్చాడు. ఆ భార్య నెక్కడికీ పంపేవాడు కాడు. పొరుగిళ్ళకు కూడా వెళ్ళేది కాదు. మేనత్తా, భార్యా, గవరయ్యా - ముగ్గురూ మూడు దెయ్యాలలా వుండేవారు. ఒక పుకారు కూడా వూళ్ళో వుండేది. గవరయ్య పెళ్ళాన్ని ఏదో భూతం ఆవహిస్తూంటుందనీ,

ఊళ్లో ఎవరికి తెలియకుండా అందరూ నిద్రపోయే అర్ధరాత్రివేళ భూతవైద్యుడెవడో వచ్చి ప్రయోగాలు చేస్తాడనీ ధూపాలు వేస్తాడనీ చెప్పుకుంటూంటారు. ఇంత వంటరిగా సంఘ జీవితంలో కలవకుండా వీళ్ళెలా వుంటున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కొంతకాలానికి గవరయ్య పుట్టిన వూరునుండి వచ్చానని చెప్పుకుంటూ కొన్నాళ్ళు ఆ వూరిలో ఒక గాజుల వర్తకుడు తిరుగుతుండేవాడు. అతడు గవరయ్యను గురించిన భోగట్టా అందజేశారు.

గవరయ్య తండ్రి చాలా దుర్మార్గుడట. జూదమూ, తాగుడూ రెండింటినీ సమపాళంగా అభ్యసించి ప్రాక్టీసు చేశాడుట. తల్లి రోగిష్టిదై మంచాన పడి ఉండేది. అందువలన గవరయ్య తండ్రి పొరుగూళ్లో ఒకావిడని వుంచుకొన్నాట్ట. గవరయ్య చిన్నతనంలో తల్లి సంరక్షణ ఏమీ ఎరగనివాడు. తండ్రికున్న చెడ్డపేరువలన గవరయ్యతో ఎవరూ కలిసేవారు కాదు.

ఆఖరికి ఆ వూరి బళ్ళో కూడా చేరనివ్వలేదు. ఆ స్కూలు స్థాపించినాయన అక్కడ పేరొందిన భూస్వామి. ఆ భూస్వామితో గవరయ్య తండ్రికి ఎడతెగని వైరం. భూస్వామి పలుకుబడీ దైవభక్తి వున్నవాడు. ప్రతిఏటా సుబ్బరాయుడి షష్టి ఉత్సవాలూ అన్న సంతర్పణా చేయించేవాడు. గవరయ్య తండ్రి రౌడీ ముఠాతో చేరి ఆ వుత్సవాలలో గలభా చేయించేవాడు. ఒకానొక ప్రాణావసర సమయంలో గవరయ్య తండ్రి చేత యిచ్చిన దానికన్న రెండు రెట్లుకి తనఖా వ్రాయించుకొని వున్న భూమి కాస్తా అన్యాయంగా కాజేశాడని గవరయ్య తండ్రి ఆరోపణ.

కాని వూళ్లో పెద్దలు ఒక రౌడీ మాటల్ని నమ్మేటంత అవివేకులు కారు. అదే కాక వాళ్ళు చాటుమాటుగా వడ్డీ వ్యాపారం ఆ భూస్వామి పద్ధతిమీదే చేస్తున్నారు కాబట్టి పెద్దమనిషీ పరమ భక్తుడూ అయిన భూస్వామి యిలాంటి అక్రమం చేస్తాడని కలలో కూడా ప్రజాస్వామ్యం నమ్మదలచుకోలేదు.

గవరయ్య ఒంటరితనాన్ని చూసి బాధపడి తండ్రి ఒక కుక్క పిల్లనీ, రెండు పిల్లిపిల్లల్నీ తెచ్చి యిచ్చి వాటితో ఆడుకోమనేవాడు. “మనుషుల కంటె యివే నయం” అనేవాడు రోగిష్టి అయిన భార్యతో.

గవరయ్య బాల్యమంతా కుక్కలతో, చెట్లతో, గోడలతో ఆడుకుంటూ గడిపాడు. కొన్నాళ్ళకి రోగిష్టి తల్లి చచ్చిపోయింది. ఆమె చనిపోవడంతో గవరయ్య తండ్రి దుండగా లెక్కువైపోయాయి. గవరయ్య తండ్రికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె జబ్బుకోసం చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడీమెకు చివరి రోజుల్లో వైద్యసహాయం చేయించలేక పోవడం భూస్వామి అక్రమం వల్లనేనని ఆలోచించిన గవరయ్య తండ్రి మరీ పెట్రేగిపోయాడు. భూస్వామి పాలేరు పొలంలోంచి వస్తూండగా ఎవరో వాడి తల రెండు చెక్కలయ్యేట్టు యినుపకడ్డీతో కొట్టారు.

భూస్వామి తన అనుమానమంతా గవరయ్య తండ్రి మీద ఉందన్నాడు. గవరయ్య తండ్రిని అరెస్టు చేశారు. కేసు మోపారు. ఊళ్ళో అందరూ బలమైన సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు స్వయంగా చూసినా చూడకపోయినా, భక్తిపరుడైన భూస్వామి ఆజ్ఞల్ని దైవాజ్ఞగా శిరసావహించారు. గవరయ్య తండ్రికి యావజ్జీవశిక్ష పడింది.

తండ్రి ఆఖరిమాటగా కొడుకుతో 'ఎవర్నీ నమ్మకు. నీ కాళ్ళమీద నువ్వు నుంచో, ఈ మనుషులందరూ దొంగ వెధవలు, విషసర్పాలు' అని చెప్పి మరీ పోలీసులతో వెళ్ళాడు.

తల్లిలేని, తండ్రిలేని గవరయ్య ఆ యింట్లో బెంబేలెత్తిపోయాడు. బెంగతో రెండు రోజులు తిండి తిప్పలు లేక యింట్లో మూలగా కూర్చుని పధ్నాలుగేళ్ళ గవరయ్య హోరుమని ఏడ్చాడు. ఎవరూ ఆ ఛాయలకి రాలేదు. పలకరించలేదు. రౌడీ, హంతకుడూ అయిన తండ్రి దుర్గుణాలు వీడికి సంక్రమించి ఉంటాయనీ, వీడెకెంత దూరంలో వుంటే అంత మంచిదని ఆ వూళ్ళో మంచివాళ్ళందరూ అనుకున్నారు కాబోలు. గవరయ్యకి జ్వరం వచ్చింది. మందులేదు, మాకులేదు. జ్వరం స్ఫోటకంలోకి మారింది. ఆ యింట్లోంచి రాత్రుళ్ళు “అమ్మా చచ్చిపోతున్నానేవ్' అనే కేకలు వినవచ్చేవి భయంకరంగా దీనంగా.

మశూచి అని తెలియగానే ఆ పొలిమేరలలో కూడా జనం నడవటం మానివేశారు.

“ఈ కొడుకు కూడా పోతే వూరికి పీడా వదలిపోతుం” దన్నారు కొందరు.

ఇలా వుండగా ఒక రోజు సాయంత్రం ఒక గుర్రబ్బండీ గవరయ్య ఇంటిముందాగింది. దానిలోనుంచి నలభై ఏళ్ళ స్త్రీ దిగింది. ఒంటినిండా నగలున్నాయి. మనిషి బలంగా పొడుగ్గా వుంది. చెంపలదగ్గరైనా జుట్టు నెరవలేదు. ఆ వీధి వీధంతా వింతగా ఆమెకేసి చూస్తూ నించున్నారు. కాని ఆమె పక్కకి కూడా చూడకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయింది. నౌకరు పెట్టెలన్నిటినీ లోపల పెట్టి తలుపులు దభాల్న వేసేశాడు.

నౌకరు ద్వారా ఆమె గవరయ్య తండ్రికి యిలాకా ఉన్న ఆవిడనీ, ఆరునెలలు పుణ్యక్షేత్రాలు సేవించి రెండు రోజుల క్రితమే తిరిగి వచ్చిందనీ, గవరయ్య తండ్రికి యావజ్జీవశిక్ష పడడమూ కొడుకు దిక్కులేని వాడై ఉండడమూ తెలిసి యెకాయెకిని సామాన్లు పట్టించుకుని ఆ వూరు వచ్చేసిందని తెలిసింది. అంతే, నాటినుండీ గవరయ్య ఆమె సంరక్షణలో పెరిగాడు. జబ్బునుంచి కోలుకున్న గవరయ్య మరీ వికృతంగా వున్నా ఆమె లక్ష్యం చేయలేదు. తండ్రితో సంబంధమున్నంత మాత్రాన ఈ చాతకాని వికారపు కొడుకు బాధ్యత తీసుకోవడంలోని అవివేకాన్ని ఒకరిద్దరు చొరవగల స్త్రీలు ఆమెకి చెప్పిచూశారు. కానీ ఎవర్నీ లక్ష్యం చేయని గుణం ఆమెలో వుంది. కొన్నాళ్ళకి ఒక పిల్లని వెతికి తెచ్చి గవరయ్యకి పెళ్ళి చేసింది. గవరయ్య ఇరవయ్యోయేట ఆమె మరణించే ముందు గవరయ్యకి తన నగలూ, పదివేల రూపాయల నగదూ యిచ్చివేసింది.

తర్వాత అతనీ వూరిలో మేనత్త ఇంటికి రావడం, తోళ్ళ వ్యాపారం చేయడమూ, ఏడెనిమిదేళ్ళకు మొదటి భార్య పోవడమూ ఊళ్ళో అందరికీ తెలిసినదే. ఈ చరిత్ర అంతా గాజుల వర్తకుడి ముఖతః విన్న తర్వాత గవరయ్య అంటే ఉన్న వాళ్ళ అసహ్యభావం యీసారి తార్కికమైన ఆధారంతో మరింత గట్టిపడింది. తండ్రి దుర్మార్గుడు, హంతకుడు, వీడు చిన్నతనం నుండి పిల్లులతో కుక్కలతో కలిసి జంతు లక్షణాలు అలవరచుకున్నాడు. పైగా వీడి పెంపకం ఒక చెడిన స్త్రీ చేత, ఇంతటి అమానుషుడు వచ్చీ వచ్చి తమ వూళ్ళో పడ్డాడనే బాధ ఒక వైపున పీడించింది నలుగుర్నీ.

అయినా అవధాని మొదలైన పెద్దలు మొదట నిరాశ చెందలేదు గవరయ్య దుర్మార్గుడు నిజమే. వికృత రూపుడు _ అదీ నిజమే _ పిసినిగొట్టు, ఎవరికీ కానీ రాల్చడు - ఒప్పుకున్నాం - ఒంటెత్తు మనిషి, సభ్యత లేనివాడు. అందరికీ తెలుసును; అయితేనేం ధవవంతుడు. ఆ ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగించేటట్టు చేస్తే అతనికీ, పెద్దలకీ ముక్తి వుంది. ఇంత ఉదారాశయంతో ఎన్నోవిధాల ఎన్నోసార్లు గవరయ్యని కదిపి చూశారు. వేణుగోపాలస్వామి ఉత్సవాలన్నారు. మండపం కట్టించాలన్నారు. ఒకవైపు ఒరిగిన ప్రాకారం బాగుచేయించా లన్నారు. దేనికీ గవరయ్య లొంగిరాలేదు. చివరికి గుళ్ళోకివచ్చిదైవ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోమన్నారు. అది ఖర్చులేని పని. ఎప్పటికైనా గవరయ్య రాతిగుండెలలో భక్తి విత్తనం నాటుకుంటుందని వాళ్ళ ఆశ. కాని ఏనాడు గవరయ్య గుడి చాయలకి కూడా రాలేదు.

ఒక తోటివాడు నాస్తికుడై పాపియై పోతూంటే ఊరుకోలేని మంచితనం వలన, కార్యదీక్షవలన ఊరిపెద్ద లతని మీద బహిష్కరణాస్త్రం ప్రయోగించారు.

కానీ అదేమి పనిచేయలేదు. ఎందుకంటే గవరయ్య ఊరినే బహిష్కరించాడు మొదటినుండీ. చాకలీ, కోమటీ, మంగలీ అతనికి చాటుచాటుగా వాళ్ళ వాళ్ళ సేవలందించడం మానలేదు కూడా. నిక్కచ్చిగా వాళ్ళందరికీ జీతాలిస్తాడేమో గవరయ్య బేరాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళెవరూ ఇష్టపడలేదు.

మొదటి భార్య కాలుజారి నూతిలోపడి మరణించినప్పుడు అవధానీ తదితరులూ గవరయ్యని పరామర్శించారు. ఇదంతా కర్మఫలితమనీ, యిప్పటికేనామేలుకోమని హెచ్చరించారు. కాని గవరయ్య ఖాతరు చేయలేదు. పైగా ఏడాదిలో తనకన్న పదిహేనేళ్ళు చిన్నదైన ఒక పిల్లను పెళ్ళి చేసుకుని యింటికి తీసుకొచ్చాడు. ఆ పిల్ల అందం ఎటున్నా ఫ్యాషన్ గా అలంకరించుకునేది. ఆమెని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసేవాడని గవరయ్యని గురించి అనుకునేవారు. అయితే ఆమె అయినా ఇల్లుదాటి యీవలికి వచ్చేది కాదు. ఎవరేనా కుతూహలం కొలదీ వెళ్ళి పలకరిస్తే కబుర్లు సరదాగా చెప్పేది. ఎవరైనా గవరయ్య రూపాన్ని గురించిగాని, వయస్సు గురించిగాని వ్యంగ్యంగా హేళనచేస్తే “ఆయన చాలా మంచివారు” అనేదిట. నాలుగు రోజుల కొకసారి ప్రక్క టౌన్ కి బండి మీద వెళ్ళి సినిమా చూసి వచ్చేదిట. గవరయ్య తన నిబంధనల్ని ఈ భార్య విషయంలో సడలించాడని ఆశ్చర్యపోయారు. కానీ ఆ సడలింపు కూడా కొంతవరకే. ఆ యింటిలో వున్నవాళ్ళు అలాగ మనుషులకి, వూళ్ళో జరిగే సంఘటనలకి దూరంగా వుండవలసిందే.

ఎదురింటి అరుగుమీద వున్న మిషన్ కుట్టువాడితో యీమెకి లేచిపోవడందాకా యింత చనువు ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. కాని ఈ దుస్సంఘటనతో మున్సబూ, కరణమూ, తదితరులూ మహదానందం పొందారు. కటికి చీకట్లో వాళ్ళకి మళ్ళీ ఆశాకిరణం గోచరించింది. ఇనుం వేడెక్కినప్పుడేసాగగొట్టాలన్నారు. నలుగురూ కలసి ఒక రోజున గవరయ్య యింటికి వెళ్ళారు. ఇల్లు చాలా పెద్దది. మండువాలోగిలి, ఇంటిచుట్టూ పెద్దదొడ్డి; వెనకాల గడ్డివామూ, దూడల పాకా, చెట్లు, చేమలూ వున్నాయి. ఆపైన యింకేమీ ఇళ్ళు లేవు. అన్నీ పొలాలే, మేనత్త వున్న చిన్న లోగిలిని క్రమ క్రమంగా పెంచే యింత యింటిని చేశాడు గవరయ్య.

ఆ ఇల్లు అన్ని ఇళ్ళలా వుండదు. కలకల లాడుతున్నట్టు వుండదు. ఏదో భయంకరమైన ఏకాంతం ఆ ఇంట్లో పేరుకున్నట్టు వుంటుంది.

రాత్రిళ్ళు దెయ్యాలు గదిలోంచి గదిలోకి వంకర కాళ్ళతో తిరిగి తిరిగి పగటివేళ అటకమీదా, చూరు మూలల్లోను దాక్కున్నట్టు వుంటుంది. పలుకుబడీ, స్తోమతూ సహజంగా ధైర్యమూ వున్న ఆ నలుగురికి ఆ ఇంట్లో అడుగు పెడుతూంటే కొంచెం బెదురుగా వుందన్న మాట నిజం.

గోడకు చేరబడి కళ్ళు మూసుకుని వున్నాడు గవరయ్య. బనీనులోంచి అతని బలిష్టమైన రొమ్మూ , కండలూ మశూచికపు గుంటలతో గాట్లు తిన్న తుమ్మబాదుల్లా వున్నాయి. అడుగులు చప్పుడు విని కళ్ళు తెరచి చూశాడు. కళ్ళు ఎర్రజీరలతో తాగినవాడి కళ్ళలా వున్నాయి. అవధానీ, మున్సబూ, కరణమూ, మరొక పెద్దమనిషీ తేరి చూస్తున్న గవరయ్యకి దగ్గరగా వున్న బల్లమీద కూర్చున్నారు. గవరయ్య యేమన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూశాడు.

“నీకు రావలసిన కష్టం కాదోయ్ గవరయ్యా. నిమ్మకు నీరోసినట్టు వుండే స్వభావం నీది. ఒకరిజోలీ కొంఠీ అక్కర్లేదు. విషయం తెలియగానే 'అరే! పాపం' అని మనస్సు కొట్టుకులాడి పోయిందంటే నమ్ము” అన్నాడు కరణం.

గవరయ్య మాట్లాడలేదు. అలాగే చూస్తున్నాడు.

పన్నులు కట్టడంలో కానీ, పాలేళ్ళకి జీతాలివ్వడంలో కానీ _ తన ధర్మం తాను టైముకి నెరవేర్చుకునేవాడు. ఒకరి సొమ్ము ఎప్పుడూ తన దగ్గర వుంచుకోలేదు. సుబ్బయ్యగాడికి సాలు తిరక్కముందే ధాన్యం కొలిచి యిచ్చేశాట్ట గవరయ్య. “వాడు తెగ చెప్పుకోవడమే __మా కామందు మహదొడ్డమనిషీ అని...” అన్నాడు మున్సబు,

గవరయ్య అలాగే చూస్తున్నాడు. అతను వీరి మాటలు వింటున్నాడో లేదో తెలియదు.

“కాని ఒక్కమాట గవరయ్య బాబూ!” మందంగా, గంభీరంగా, అందులోనే ఒక విశేషమైన దయా, మృదుత్వాన్నీ కలిపి వాచా చమత్కారియైన అవధాని ధర్మకర్తృత్వపు హోదాతో పలికాడు. “భగవంతుడి ఆసరా లేకుండా ఎటువంటివాడూ యీ సంసార సాగరాన్ని సుఖంగా దాటలేడనుకో. నువ్వా ఉత్తముడివి. ముక్కుకి సూటిగా పోయేవాడివి. అయితేనేం; నీ వ్యాపారం వుంది చూడు _ అది కేవలం ధర్మవిరుద్ధమని శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. అయితే కలియుగంలో కొన్ని మినహాయింపులు చేశారు మనుషులు. అందుకని ఫరవాలేదు. కాని ఒక్కటి చెప్పారు _ ఏమైనా ఆ భగవంతుని స్మరించడం మానకుండావుంటే అన్ని కష్టాలూ మంచులా విడిపోతాయి. ఫలం, పుష్పం, పత్రం, తోయమ్ _ అన్నారు _ భగవానుడు అల్పసంతోషి....”

క్రమంగా అందరి మొహాలలోనూ విజయాన్ని సూచించే నవ్వు అలముకొంది. ఎప్పుడూ కసురుకొని విసుక్కునే గవరయ్య యీ వేళ మౌనంగా వున్నాడు. అభేద్య మనుకున్న కోట గోడకు పగులు ఏర్పడింది. ఇంక మెల్లమెల్లగా గవరయ్యని మార్చివేయవచ్చుననే భావం వారిలో ఏర్పడింది. అందరూ లేచారు, వెళ్ళివస్తామన్నారు. కాని గవరయ్య అలాగే శిలాప్రతిమలా కళ్ళప్పచెప్పి చూస్తూ కూర్చున్నాడు.

ఒక ఏడాది గడిచింది. అప్పుడప్పుడు కరణము, మున్సబూ వగైరాలు గవరయ్య ఇంటికి వచ్చి పోతున్నారు. గవరయ్యని దైవ దర్శనానికని, హరికథకనీ, మరొకటని చెప్పి పిలుచుకు వెళుతున్నారు. ఊళ్ళోవాళ్ళూ కూడా గవరయ్య వీధిలో వెళుతూంటే నమస్కారాలు పెడుతున్నారు. గవరయ్య మాత్రం ఏమీ మాట్లాడడు. మంత్రించిన వాడిలా ఆ దేవాలయంలో కానీ, హరికథలో కానీ కూచుంటాడు. సగంలో ఒక్కొక్కసారి చటుక్కున లేచి వెళ్ళిపోతాడు.

పెద్దలు తలపంకించి 'రాక్షసముండాకొడుకు, ఒక్కరోజులో మారతాడా' అనేవారు.

“మారకేం చేస్తాడు? సంఘాన్నీ, ధర్మాన్ని కాదని ఎక్కడికి పోతాడోయ్ వీడు” అనేవాడు అవధాని.

వేణుగోపాలస్వామి గుడి ప్రాకారం పూర్తిగా పడిపోయేటట్టు వుంది. ఇంక జాగుచేస్తే లాభం లేదనుకున్నారు వూళ్ళో పెద్దలు. పాతిక వేలైనా వుంటేగాని యీ పని జరగదు. అంత మొత్తాన్ని ఒక్క గవరయ్య తప్ప యివ్వగలిగినవాడు మరొకడు లేడన్నారు. ఈ యేడాదిలోనూ గవరయ్య చాలా లాభాలు సంపాదించాడు. తోళ్ళ వ్యాపారం అలా వుండగా, పట్టణంలో నూనెమిల్లులో ముప్పాతికవాటా కొన్నాడు. ఒక్క వేరుశనగ నూనెలోనే ఒక లకారం వచ్చిందని వూరంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఈ అభివృద్ధికి కారణం అతనిలో పొడచూపిన దైవభక్తి అనివాళ్ళనుకోవడమే కాకుండా అతడు ఏమరిపోతాడేమోనని అతనివద్ద మరిమరీ పనికట్టుకు చెప్పేవారు. ఒక మంచి రోజున మున్సబూ, కరణమూ, ధర్మకర్తా యింకా వూళ్ళో మోతుబరులూ, అందరూ కలిసి గవరయ్య యింటికి వెళ్ళి ప్రాకారోద్దరణను గురించి చెప్పారు. అతనే పూనుకోవాలన్నారు.

''నీ పేరు చిరస్థాయి అయిపోతుంది. గవరయ్యా! నీ పేరు మీదుగా రోజూ పూజాపునస్కారాలు జరిపిస్తాం” అనీ చెప్పారు.

“దేవుడికి అసలు గుడెందుకు? ఆ గుడి చుట్టూ గోడెందుకు?” అన్నాడు గవరయ్య చుట్ట చివరని నోట్లో నములుతూ.

“అపచారం! అపచారం!” అని లెంపలువాయించుకున్నాడు కరణం.

ధర్మకర్త కరణానికి కన్ను గీటాడు. 'గవరయ్య వేసిన ప్రశ్న సామాన్యమైనది కాదు. తత్వవేత్తల్నీ, మహర్షుల్నీ కూడా ముప్పు తిప్పలు పెట్టిన జటిల ప్రశ్న అది. అయితే గవరయ్యలో మనకి తెలీకుండానే గొప్ప సాధన జరుగుతోంది. నాలుగు రోజులు మనం ఓపిక పడితే గవరయ్య వంటి పెద్దమనిషి తన ప్రశ్నకి తనే జవాబు పొందుతాడు. భగవదనుగ్రహం నేరుగా ఒక్కసారి రాదోయ్. అంచెలంచెలుగా వస్తుంది. అలాగ వచ్చిన రోజున గవరయ్య ఏది - మన గవరయ్యే వచ్చి “ఇదిగో అవధానిగారూ, ఈ పదివేలు దగ్గరుంచండి - ప్రాకారం కట్టించెయ్యండి” అని అనడూ?”

గవరయ్య ఎప్పుడూ చెయ్యనివాడు అవధానికి నమస్కారం చేశాడు. “సెలవు తీసుకోండి. నాకు పనుంది. టౌనుకెళ్ళాలి” అని అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. అవధాని ఆశ్చర్యపడ్డాడు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు.

“అవధానీ జయించావోయ్. తల వంచి నీకు నమస్కరించాడు కూడా! వీణ్ణి తగలెయ్యా __మారుతున్నాడు, మారిపోతున్నాడు” అన్నాడు కరణం హుషారుగా.

"ఈ వర్షాకాలం వెళ్ళేసరికి – నే చెబుతున్నాగా _ పాతికవేలూ మన ముందు పడేస్తాడు. ఆ ప్రాకారంతోపాటు మన యిళ్ళకి ప్రహరీ గోడలు లేస్తాయి!” అన్నాడు మీసాల్లో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మున్సబు.

వర్షాకాలం రానే వచ్చింది. రావడంలో మంచి వూతంగా, కోపంగా బలంగా వచ్చింది. కుంభవృష్టిగా వర్షం, దట్టమైన మేఘాలతో నల్లబడిన ఆకాశంమెరుపులూ, వురుములూ ప్రకృతి పెళ్ళిపందిరిలా హడావిడిగా వుంది. రోడ్లు బురదైనా కుచ్చెళ్ళ నెత్తిపట్టుకొని ఆడవాళ్ళు, అందులో కొత్తగా పెళ్ళయిన వధువులు సరదాగా పేరంటాలకి వెడుతూ వస్తున్నారు. రైతాంగం అంతా పొలంపనుల్లో పడిపోయారు. మున్సబు పెళ్ళానికి కీళ్ళు నొప్పులూ, అవధాని కూతురికి వేవిళ్ళూ అయినా గ్రామం వుమ్మడి సౌఖ్యానికి అవేమీ ఆటంకంగా లేవు. కరణం విధవ చెల్లెలు కిటికీలోంచి ఎదురింటికి చుట్టంచూపుగా వచ్చిన బస్తీ అబ్బాయికేసి అదే పనిగా చూస్తూ చెయ్యి వూపుతున్నా షార్టుసైటూ మబ్బునీడలూ మూలాన అతనికి ఆ సిగ్నల్స్ కనబడటం లేదు. ఎండైనా వానైనా గ్రామం శివార్లలో వున్న కూలీ, నాలీ జనం, మురికిగుంటలూ పందులూ, జబ్బులూ అన్నీసక్రమంగానే వున్నాయి. పంచాయితీవాళ్ళు కట్టించిన లైబ్రరీ బిల్డింగులో పేకాట నిరంతరం సాగుతోంది.

ఇలాంటి చల్లని సుఖమైన వాతావరణంలో పిడుగులాంటి వార్త చటుక్కున ఊరంతటినీ దద్దరిల్ల చేసింది. మున్సబూ, ఒకరిద్దరు పెద్దలూ మున్సబు యింటి అరుగుమీద కూర్చుని శాలువ కప్పుకొని వెచ్చగా చుట్టలు కాలుస్తూ ఆధ్యాత్మిక గోష్టి సలుపుకుంటున్నారు. ఆ సమయంలో పానకాలు అక్కడికి పరిగెత్తుకుని వచ్చాడు. వాడి కళ్ళల్లో విపరీతమైన కంగారు ఉంది. వాడి వాలకం చూస్తే వాడి వెనకాలే భూకంపమో, వరదో గ్రామానికి వచ్చినట్టుంది.

“ఏంరా! ఏం జరిగిందిరా?” అన్నాడు మున్సబు.

“అదొచ్చిందండీ తిరిగివచ్చిందండీ” అన్నాడు పానకాలు.

రెజ్లల్ల క్రితం మున్సబుగారి గిత్తదూడ కట్టు తప్పించుకొని పారిపోయింది. మున్సబు చిరునవ్వుతో "అయితే యింకేం నేవచ్చి చూస్తాలే. కొకొట్టాంలో కట్టెయ్” అన్నాడు.

“గిత్తకాదు బాబూ! గవరయ్య పెళ్ళాం!” అన్నాడు పానకాలు మెల్లగా.

అందరూ చటుక్కున నిటారుగా కూర్చుని “ఆఁ ఆఁ ఏమన్నావ్!” అన్నారు ఏకకంఠంతో. పానకాలు చెప్పిన వివరణ యిది.

రాత్రి చాలా పొద్దుపోయాక పట్నంలో రెండో ఆట సినీమా చూసివస్తూన్న బట్టలకొట్టు నరసింహం వూరు సమీపించే వేళకి రోడ్డుకి పక్కగా చెట్లనీడలో ఎవరో కదులుతూండడం చూశాడు. అతనికి దెయ్యమేమో అని అనుమానం భయమూ కలిగి గుండెలు దడదడలాడాయి.

అక్కడికి కాస్త దూరంలో పాకలో పడుకున్న పానకాలుని కంగారుగా లేపాడు. ఇద్దరూ వచ్చి చూశారు, రేగినజుట్టూ నల్లని మాసినబట్టలూ, నడవలేక ఒక్కొక్క అడుగువేసే ఆడకూతుర్ని చూశారు. ఆమె చేతిలో చిన్నమూట వుంది. ఎవరా అని దగ్గర్నుంచి చూశారు. పోల్చలేకపోయారు. పలకరించారు. ఆమె మాట్లాడలేదు. ఆమె నడక వేగం హెచ్చించింది. వీళ్ళిద్దరూ అంతదూరంనుంచే ఆమెను అనుసరించారు. ఆమె పొలాలమ్మటే వెళ్ళి గవరయ్య యింటి పెరటి నానుకున్న పాకలోకి వెళ్ళింది. ఆ పాక గవరయ్య ఇంటి పెరటికీ, పొలాలకీ మధ్యగావుంది. పాకలో కర్రపేళ్ళూ, పాతసీనారేకు డబ్బాలూ లాంటి చెత్తాచెదారం అంతా వుంది. గవరయ్యను లేపి చెపుదామంటే యింత రాత్రివేళ లేపితే తంతాడని భయం వేసింది.

మళ్ళీ యిప్పుడా సంగతి జ్ఞాపకం వచ్చి పాకవైపు వెళ్ళి చూశాడు. ఎవరోకాదు ఆ ఆడమనిషి __ గవరయ్య పెళ్ళామే! కడుపు చాలా ఎత్తుగా వుంది. నెలలు నిండినట్టున్నాయి. గడ్డిమీద పడుకుని మూలుగుతూవుంది.

“ఈ సంగతి గవరయ్యకు తెలుసునంటావా _” అన్నాడు మున్సబు.

“తెల్లుబాబూ. తెల్లారగట్లనే లేచి టౌనుకెళ్ళిపోతాడుగా గవరయ్య” అన్నాడు పానకాలు.

మున్సబు తొందరగా లేచాడు. చెప్పులు వేసుకుని బయల్దేరాడు అవధాని ఇంటికి. దారి పొడుగునా అందరూ పలకరిస్తున్నారు.

“ఏం మున్సబూ, గవరయ్య పెళ్ళాం తిరిగొచ్చిందటగా, ఈవూరూ, ఈ మడుసులూ, ఏమైపోతున్నారు బాబూ. మంచీ, చెడ్డా, పున్నెంపాపం అన్ని మట్టి...

...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshaneeyam

  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8

4.8

4 ratings


More shows like Harshaneeyam

View all
The New Yorker Radio Hour by WNYC Studios and The New Yorker

The New Yorker Radio Hour

6,814 Listeners

The TLS Podcast by The TLS

The TLS Podcast

184 Listeners