ఐదు దశాబ్దాల క్రితం తెలుగులో ఒక సినిమా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మించి, నటించిన ‘సుడిగుండాలు’ చిత్రం. ఈ చిత్రం నాటి సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ, నవలలు, మ్యాగజెన్స్ లో వచ్చే అశ్లీల సాహిత్యం, వల్ల యువత ఏవిధంగా తప్పుదారి పడుతున్నారో తెలపటంతోపాటు, నేటి బాలరే, రేపటి పౌరులే అని, వారిని కాపాడుకోవల్సిన బాధ్యత ఈ సమాజంలోని ప్రతి పౌరుడిదనే సందేశాన్నిఅందించింది.