'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 05/11/2023
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కి చంద్రంని తీసుకు వచ్చి రెండురోజులయ్యింది. వచ్చిన రోజు మధ్యాహ్నం యాదిరెడ్డి అతడిని విచారించాడు. ఇంచుమించు రవళి చెప్పిన
విషయాలే అతడు చెప్పాడు కొన్ని మినహా.
పార్టీ మధ్యలో మనోరమ వెళ్ళి పోయిందన్నాడు. కానీ ఊర్మిళ వచ్చి పార్టీ మధ్యలో వెళ్ళిపోయింది. దిలీప్ రాలేదని చెప్పాడు. రెండూ తప్పులే. కానీ గెస్ట్హౌస్ వాచ్మెన్
చెప్పాడు. ఆ పార్టీకి దిలీప్ వచ్చాడు. మనోరమ చచ్చిపోయిందని యాదిరెడ్డి చెప్పడంతో చంద్రం మొహం భయంతో వణికిపోయింది. అసలీ విషయం దిలీప్ తనకు
ఎందుకు చెప్పలేదు? లోలోపల తిట్టుకున్నాడు.
ఈ లోగా సెల్లో ఉన్న యాదయ్యను తీసుకురమ్మనాడు యాదిరెడ్డి. యాదయ్య వచ్చి భయం భయం గా నిలుచున్నాడు. మాసిపోయిన బట్టలు, పీక్కుపోయిన
మొహం, గెడ్డం పెరిగిపోయి చింపిరి జుట్టుతో బాగా నీరసం తో ఉన్నాడు.
"పార్టీకి దిలీప్ వచ్చాడా ? మనోరమ చచ్చిపోయిందా" అనడిగాడు, యాదయ్యకేసి చూస్తూ యాదిరెడ్డి. ఎదురుగా ఉన్న చంద్రంని, ప్రక్కనే లాఠీతో ఉన్న కానిస్టేబుల్ ని, తన కేసి తీవ్రంగా చూస్తున్న యాదిరెడ్డి ని చూశాడు యాదయ్య. అవునన్నట్లుగా తలూపాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.