నా దేశ పౌరులందరికీ 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ...
భారత దేశం నా మాతృ భూమి అని చిన్నపుడు ఎపుడో స్కూల్ లో చదివినట్టు గుర్తు , కానీ ఇపుడు తెలిసొచ్చింది.....తల్లి పేరుమీదున్న భూమికోసం అన్నదమ్ములిద్దరు కొట్టుకు చస్తుంటే.....నా దేశానికి " స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయ్యిందని..
పంజాబ సింధు గుజరాత మరాఠా అని గర్వంతో ఉచ్చరించేటప్పుడు అనుకోలే ..., ఈ దేశం లో కులం మతం ప్రాంతం కోసం ప్రాణాలు కూడా పణంగా పెట్టి యుద్దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా కల్లోలం సృష్టించగల మనుషులున్న నా దేశానికి స్వతంత్రం వచ్చి74 ఏళ్ళు అయ్యిందని..
ఆడది అర్దరాత్రి 12 గంటలకి తిరిగినపుడే నిజమైన స్వాతంత్రమని గాంధీ గారంటే అర్ధం చేసుకోలేదు ....కానీ ఇపుడు అర్ధమయింది ఒక ఆడది ఒంటరిగా 9 గంటలకు బయట తిరిగినా మానభంగాలు చేసే మృగాళ్ళున్న నా దేశానికి స్వతంత్రం వచ్చి74 ఏళ్ళు అయ్యిందని..
పెద్దోడు పేదోడి రక్తం తాగుతున్నా , ఉన్నోడు లేనోడి ఉసురు తీస్తున్నా , దేశ స్వాతంత్ర ఫలాలు అర్హులకు అందినా అందకున్నా, నిరుద్యోగం పెరిగినా , ఆకలి చావులు ఆగకున్నా
నా దేశమంటే నాకు ఇష్టం ...ఓ ప్రజాస్వామ్య దేశమా నీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు