'Raghupathi Raghava Rajaram Episode 4' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar
'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: పారుపల్లి అజయ్ కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కాలేజీ లెక్చరర్ గా పని చేస్తుంటాడు రఘుపతి. కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు. ఆ యువతిని, గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు.
స్పృహ వచ్చిన ఆ యువతి- తన పేరు కమల అనీ, తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారనీ చెబుతుంది. కమలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి.
రాఘవ, సీతయ్య ల ఘర్షణలో అడ్డు వెళ్లిన రఘుపతి గాయం అవుతుంది.
రఘుపతి కోలుకుంటాడు. అతని కోరిక మీద రాఘవ ఎడ్ల పందాలలో పాల్గొని గెలుస్తాడు.
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 4 చదవండి..
కాలేజీకి వెళ్ళగానే నోటీసు బోర్డులో ఉన్న ఒక సమాచారం రాజారాం దృష్టికి వచ్చింది.
సాయంత్రం 5 గంటలకు కాలేజీ ఆడిటోరియంలో 'అవయవ దానం' పై కుమారి కళ్యాణి ప్రసంగం ఉంటుంది. అభిరుచి, ఆసక్తి వున్నవాళ్లు హాజరు కావచ్చు అని దాని సారాంశం.
సోషల్ సర్వీస్ మీద ఉత్సుకత చూపించే రాజా సాయంత్రం కాలేజీ క్లాసులు అయిపోగానే కొంత మంది స్నేహితులతో కలసి ఆడిటోరియం కు వెళ్ళాడు.
డయాస్ పైకి చూపు సారిస్తూనే ఒక్కక్షణం విస్తుపోయాడు రాజారాం.
ముగ్ధ మనోహర సుకుమార లావణ్యవతి, ఇరవై ఏళ్ళ లేలేత జవ్వని వున్నది అక్కడ.
ఈమేనా ఈ టాపిక్ డీల్ చేసేది అని సంశయించాడు.
కాలేజీ కుర్రవాళ్ళ సంగతి తనకు తెలుసు. ఉపన్యసించడంలో ఏమాత్రం తటపటాయించినా తాటాకులు కడతారు. పిల్లికూతలు కూస్తూ కార్యక్రమమాన్ని రసాభాస చేస్తారు. ఏ కొద్దిగో చెపుదామని వచ్చిన వారు ఆ కంగారులో అది కాస్తా మరచిపోయి అభాసుపాలవుతారు.
సన్నగా, పొడుగ్గా, చలాకీగా కనిపిస్తున్న ఆ అమ్మాయిని జాలిగా చూసాడు.
కాలేజీ ప్రిన్సిపాల్ గారు మైక్ దగ్గరకొచ్చి "చాలా చిన్న వయసు లోనే కుమారి కళ్యాణి గారు 'అవయవ దానం' అనే విషయం మీద అనర్గళంగా మాట్లాడుతున్నారు.
టీ వీ లో కూడా వీరి ఉపన్యాసాలు వచ్చాయి.
దేశం లోని చాలా యూనివర్సిటీలలో, ప్రముఖ కాలేజీలలో వీరు వందలకొద్దీ ప్రసంగాలు చేసారు.
ఎన్నో కళాశాలలు, స్వచ్చందసంస్థలు వీరిని ఆహ్వానించి వారి దగ్గర ఉపన్యసించమని కోరుతున్నారు. మన కాలేజీ ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ రోజు మనదగ్గరకు వచ్చారు. మీరంతా వారు చెప్పేది విని ఇష్టమైన
వారు అవయవ దానానికి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు కళ్యాణి గారు మాట్లాడుతారు."
అంటూ ఆయన డయాన్ నుండి క్రిందికి దిగారు.
కళ్యాణి మైక్ దగ్గరకు వచ్చింది.
అడిటోరియం అంతా కలయచూస్తూ "సభకు నమస్కారం" అన్నది.
కోయిల గానంలా ఆమె స్వరం ఆ అడిటోరియం ను పరవశింపచేసింది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/ZbKqDagBmqI