మధుమాలిని జానపద నవల Part 1 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep..
All Parts:
మధుమాలిని Madhumalini Telugu Novel Part 1: https://youtu.be/zKeJ3ZY-xqs
మధుమాలిని Madhumalini Telugu Novel Part 2: https://youtu.be/si59nuIwOiU
మధుమాలిని Madhumalini Telugu Novel Part 3: https://youtu.be/QqUbA5benK0
మధుమాలిని Madhumalini Telugu Novel Part 4: https://youtu.be/V3Kcs0DaqO8
మధుమాలిని Madhumalini Telugu Novel Part 5: https://youtu.be/OgpA51iSWE8
మధుమాలిని Madhumalini Telugu Novel Part 6: https://youtu.be/m8EfPnEW8aU
OUR LINKS:
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive
అమ్మవారికి పూజ చేస్తున్న సమయంలో కొందరు ముసుగు దొంగలు ఆలయంలోకి ప్రవేశించి పూజారిని గాయపరచి, అమ్మవారి మెడలోని పచ్చల పతకాన్ని దొంగిలించుకు పోతారు. ఆఖరి క్షణంలో ఆ దొంగ ముఖం చూస్తాడు పూజారి. కొడుకుకి ఆలయబాధ్యతలు అప్పచెప్పి, అడవిలో నాగమల్లు ఉండే గూడానికి చేరుకుని అతన్ని పచ్చల పతకం తెచ్చిపెట్టమని కోరుతాడు.
అది తీసుకు రావడం గజదొంగ శ్యామలుడి ద్వారానే సాధ్యమని, అతన్ని వెతికి ఆ కార్యం అప్పచెబుతాడు నాగమల్లు. ఆ దొంగ తనం చేసింది పాంచాల రాజ్య మహామంత్రి సుబుద్ధి అనికూడా చెబుతాడు. పాంచాల, ప్రవాళ రాజ్యాల్లో దొంగతనాలు చేసి కళింగ రాజ్య రాజధాని సంపెంగ నగరానికి చేరుకుంటారు శ్యామలుడు, గదాధరుడు. అక్కడ అందరు చూస్తుండగానే కర్కోటకుడిని నిలువు దోపిడీ చేస్తారు. మహామంత్రి నెచ్చెలి వారిజాక్షి భవనంలోకి చొరబడి, పచ్చల పతాకాన్ని చేజిక్కించుకుంటారు. సరిగ్గా అదే సమయంలో, మహామాంత్రికుడు శార్దూలుడు ప్రయోగించిన ఒక భయంకర ఆకారం, అక్కడ ఉన్న అందర్నీ నాశనం చేసి, శ్యామాలుడి దట్టిలో ఉన్న పచ్చల పతకంతో మాయమైపోతుంది.
మహామంత్రి శ్యామలుడుకి ఉరి శిక్ష విధిస్తాడు. గదాధరుడు, శ్యామాలుడిని తప్పించి తీసుకెళ్తాడు. దారిలో ఓ మంత్రగత్తెను కాపాడతారు. ఆమె ద్వారానే పచ్చల పతకాన్ని మాయం చేసింది మహా మాంత్రికుడు శార్దూలుడని తెలుసుకుంటారు. మాయా దర్పణంలో అతను ఎక్కడున్నాడో చూస్తారు.
శార్దూలుడు, అతనికి సమాన బలం కలిగిన రుద్రాక్షుణ్ణి మాయోపాయంతో బందీని చేస్తాడు. రుద్రాయక్షుడి కూతురు మధుమాలిని మాయమయ్యింది. అక్కడినుండి మిత్రులిద్దరూ నీలిపర్వత శ్రేణుల్లోకి చేరుకుంటారు. నరమాంస భక్షకుల చేతిలో బందీలుగా మారతారు. అక్కడే బంధించబడి ఉన్న విదర్భ నగరపు రాకుమారి ప్రియబాంధవిని కూడా తమతో తప్పిస్తారు. వాళ్ళను తప్పించుకుంటూ ఒక గుహలోకి ప్రవేశిస్తారు. గుహలో ఒక ఎముకల గూడుకు గుచ్చబడి ఉన్న మహా ఖడ్గాన్ని తీస్తాడు శ్యామలుడు. ఆ ఎముకలగూడుకు ప్రాణం వచ్చి కనిపించిన వారిని మింగడం మొదలుపెడుతుంది. మందాకినీ నది ఒడ్డున ఉన్న స్పటిక పర్వతాలలో శార్దూలుడి స్థావరం ఉన్నదని తెలుసుకుని అటు ప్రయాణం అవుతారు మిత్రులు.
1) మహా మంత్రి పతకాన్ని ఎందుకు దొంగిలించాడు? 2) పచ్చల పతకం ప్రత్యేకత ఏమిటి? 3) వారిజాక్షి భవంతిలో ఏమి జరిగింది? 4) శ్యామాలుణ్ణి, గదాధరుడు ఎలా తప్పించాడు? 5) మధుమాలినిని అపహరించే క్రమంలో అక్కడ ఏం జరిగింది? 6) మధుమాలిని ఏమైయింది? 7) నరమాంస భక్షకులకు మిత్రులు ఎలా దొరికారు? అక్కడి నుండి వారు ఎలా తప్పించుకున్నారు? 8) ఆస్థి పంజరం ఏమయ్యింది? 9) శార్దూలుణ్ణి మిత్రులు ఎలా ఎదుర్కొన్నారు? 10) రుద్రక్షుణ్ణి ఎలా బంధ విముక్తుణ్ణి గావించారు? 11) చివరకు ఏం జరిగింది?
తెలుసుకోవాలంటే వినండి మధుబాబు గారి కలం నుండి వెలువడిన అద్భుత జానపదం "మధుమాలిని" ఆడియో బుక్..
By అడ్లూరు శ్రీధర్
#మధుమాలిని #షాడోమధుబాబు #Madhumalini #ShadowMadhuBabu #TeluguAudioBooks #TeluguPodcast #TeluguFantasyNovels #FantasyNovelbyMadhubabu #VoiceofSudha #madhubabunovels #WriterMadhubabuBooks #telugukathalu #chandamamakathalu #Fantasystories #folklorestories #balamitrakathalu